17 నకిలీ తూకపు యంత్రాలు స్వాధీనం, షాపులపై కేసులు నమోదు
అనకాపల్లి,(అక్షర ప్రళయం)

అనకాపల్లి జిల్లా శారద నగర్, కొత్తూరు లో ఆదివారం లీగల్ మెట్రోలజీ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ డా. సాయి రమేష్, జిల్లా చైర్మన్ డా. హేమంత్ చరపాక ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను అనకాపల్లి అసిస్టెంట్ కంట్రోలర్ బి. రామచంద్రయ్య, గాజువాక ఇన్స్పెక్టర్ ఉమసుందరి గారు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 17 నకిలీ తూకపు యంత్రాలను స్వాధీనం చేసుకొని సంబంధిత షాపులపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా రామచంద్రయ్య గారు మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నకిలీ తూకపు యంత్రాలు వినియోగించిన వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి తూకపు యంత్రానికి లీగల్ మెట్రోలజీ శాఖ అధికార సీల్ ఉండటం తప్పనిసరి అని తెలిపారు.