చొక్కాకుల రాంబాబు…
విశాఖపట్నం, మే:19(అక్షర ప్రళయం)
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చుక్కాకుల రాంబాబు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించి ..స్వయంగా పలు
సమస్యలపై వివరించి చెప్పడం జరిగినది. ముఖ్యంగా రామకృష్ణాపురం బి.అర్.టి.ఎస్ రోడ్డు వైన్డింగ్ నందు నష్టపోయినటువంటి బాధితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయమని కోరడం జరిగినది. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తానని చెప్పారు అని రాంబాబు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చుక్కాకుల రాంబాబు. మరియు ప్రధాన కార్యదర్శి దశమంతుల స్వామి జగదీష్ కుమార్ పాల్గొన్నారు.