ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి సుజాత రాజ్
విశాఖ తూర్పు, మే:20(అక్షర ప్రళయం)
లోకమాత పుణ్య శ్లోక అహల్యబాయి హోల్కర్ 300 శతాబ్ది వేడుకల సందర్భంగా మంగళవారం విశాలాక్షి నగర్ మండలంలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత రాజ్ అహల్య బాయ్ హోల్కర్ జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. సుమారు 157 దేవాలయాల పునర్ నిర్మాణం చేసి మహిళా సాధికారత కోసం మహేశ్వరి చీరలను ఆనాడే చేనేత రంగానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారని ధైర్య సాహసాలను రాజ్యపాలన ధర్మాన్ని అనుసరించడమే రాజ ధర్మం ప్రజాసేవయే నా పూజ తన మార్గంలో ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే న్యాయం ఉంటుందని ఆమె ఆనాడే చెప్పారు అని ఉమ్మడి సుజాత చెప్పారు.