న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
ఏపీలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. దీనికి సభ
ఆమోదం తెలిపింది. నవంబరు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు.