భగవంతునిపై దృష్టి నిలిపి మన జన్మ ధన్యం చేసుకోవాలి

జహీరాబాద్,డిసెంబర్1(అక్షర ప్రళయం)

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆధ్యాత్మిక తోనే మనశ్శాంతి లభిస్తుంది అని శివశక్తి జిల్లా అధ్యక్షులు ఎంపీ శ్యామ్ రావు అన్నారు మాణిక్ ప్రభు వీధి పోచమ్మ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం లో భాగంగా ఆయన ఈ విధంగా అన్నారు కార్యక్రమంలో భాగంగా గణపతి సరస్వతీ గౌరీ గాయత్రి మహా మృత్యుంజయ మంత్రంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం భక్తి గీతాలు పాడడం జరిగినది విశేషాలు అతిథిగా మహేశ్వర్ సార్ భక్తి ఏ విధంగా చేయాలి భగవంతునిపై దృష్టి నిలిపి మన జన్మ ధన్యం చేసుకోవాలని అన్నారు శివశక్తి మండల అధ్యక్షులు ఎంపల్లి సంగమేశ్వర అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగినది కార్యక్రమంలో సలహాదారు నర్సింలు గారు వెంకటేశం గారు అంబయ్య కాలనీ విద్యార్థులు మహిళలు పాల్గొనడం జరిగినది తదుపరి మహా హారతి ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *