చాక చక్యం గా ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విశాఖపట్నం,(అక్షర ప్రళయం)

నగరం లో సంచలనం సృష్టించి, నఖిలి ఐ.ఏ.ఎస్
గా చలామణి అవుతూ, చాలమంది అమాయకులకు ఉద్యోగాలు కల్పిస్తామని, నగరం లో టిడ్కో ఇల్లు ఇప్పిస్తామని నమ్మించి, ఐ.ఏ.ఎస్ అదికారిగా నకిలీ ఐ.డి కార్డ్ లు చూపించి వారి వద్ద నుండి అధిక డబ్బును తీసుకుని వారిని మోసగించిన వంగవేటి భాగ్యరేఖ @ అమృత, మన్నెందొర చంద్రశేఖర్ జంట పై ఎం.వి.పి పోలీస్ వారు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, సంబందిత న్యాయ స్థానం నందు హాజరుపరచగా, సదరు ఇద్దరు నిందితులకు 15 రోజులు రిమాండ్ విధించగా వారిని విశాఖపట్నం కేంద్ర కారగారానికి రిమాండ్ ఖైదీలు గా పంపడమైనది. సదరు జంట మార్చి 2024 లో హెచ్.అర్.సి డిపార్ట్మెంట్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నట్లు తన యొక్క నకిలీ ఐ.డి కార్డ్ ను చూపించినట్లు, టిడ్కో ఇల్లును 80,000/- రూపాయలకు ఇప్పిస్తానని పిర్యాదికి పై ఇరువురు నిందితులు మాయ మాటలు చెప్పి పిర్యాదిని నమ్మించి ఫిర్యాది యొక్క ఫోన్ పే ద్వారా పై ఇరువురు నిందితులు ఫోన్ పే లకు 80,000/- రూపాయలు డిపోసిట్ చేసుకున్నట్లు అంతట ఫిర్యాది ఇల్లు గురించి అడుగుతుంటే కాలయాపన చేస్తూ, గట్టిగా నిలదీసేసరికి పిర్యాది పైన తప్పుడు కేసులు పెడతామని పై నిందితులు బెదిరించినారు. అదేవిదంగా డిసెంబర్ 2024 లో మరో ఫిర్యాదిని కూడా జి.వి.ఎం.సి కమిషనర్ గా పనిచేస్తున్నట్లు నమ్మించి టిడ్కో ఇల్లు/ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 1,00,000/- రూపాయలు ఫోన్ పే ద్వారా డిపోసిట్ చేసుకుని ఇల్లు/ ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసినారు. ఆగష్టు, అక్టోబర్-2024 లో ఎం.వి.పి పోలీస్ స్టేషన్ పరిదిలో ఇంకో బాధితరాలుకు మాయ మాటలతొ నమ్మించి సుమారు 1,00,000/- రూపాయల విలువ గల బట్టలు తీసుకొని మోసం చేసినారు అదేవిదంగా కొంత మoది దగ్గర టిడ్కో ఇల్లు ఇస్తామని డబ్బులు తీసుకొని మోసం చేసినారు. ఆదేవిధముగా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక బాదితునకు హెచ్.అర్.సి డిపెర్ట్మెంట్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నట్లు , ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారి వద్ద నుండి 5,50,000/- రూపాయలు తీసుకొని మోసం చేసినారు. ఆదేవిధముగా నివాసం ఉంటున్న ఇంటిని కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఇంటి యజమాని కూడా ఫిర్యాదు చేయుచున్నారు. పోలీస్ కమీషనర్ డా.శంకబ్రత బాఘ్చి సూచనల మేరకు ఎం.వి.పి పోలీస్ వారు ప్రత్యేక బృందాలుగా వెళ్ళి చాక చక్యం గా ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడమైనది. ఇవి కాకుండా చాలా ఫిర్యాదులు వీరిపై వచ్చి ఉన్నాయి మన్యం జిల్లా, వంగర మండలం నుండి, విజయనగరం, విశాఖపట్నం నగరంలో అనేక మందిని ఈ విధంగా మోసం చేసినారు. అలాగే ట్రైనీ ఐఏఎస్ అని కూడా చెప్పుకొని చాలామందిని మోసం చేశారు. వారి అందరి నుండి ఫిర్యాదులు తీసుకుని తదుపరి చర్యలు తీసుకొనుచున్నాము. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ లను కలిసి పిర్యాదులు అందించవచ్చు అని పోలీస్ అధికారులు తెలయజేశారు.