459 కేసుల్లో పట్టుబడ్డా 17 కోట్ల 60లక్షల గంజాయి.
అనకాపల్లి (అక్షర ప్రళయం)

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు 2022 డిసెంబర్ 23న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాన్ని అనుసరించి, అనకాపల్లి జిల్లా పోలీసులు జిల్లాలోని పరవాడ మండలం కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని ఇన్సినరేషన్ ద్వారా నిర్వహించారు
- మొత్తం కేసుల సంఖ్య: 459
- గంజాయి మొత్తం పరిమాణం: 34,419 కిలోలు
- హాషిష్ ఆయిల్ మొత్తం పరిమాణం: 39.4 లీటర్లు
- అరెస్టయిన మొత్తం వ్యక్తులు: 1,304
- స్వాధీనం చేసుకున్న మొత్తం వాహనాలు: 205
- 1,000 కిలోల కంటే పైగా ఉన్న కేసులు: 9
- 1,000 కిలోల కంటే తక్కువ ఉన్న కేసులు: 446
- హాషిష్ ఆయిల్ కేసులు: 4
అరెస్టయిన వ్యక్తుల వివరాలు:
మొత్తం 1,304 మంది నిందితులలో 871 మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారు, 433 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు.
225 మంది ఉత్పత్తి (సోర్స్) నిందితులు
233 మంది గమ్యస్థాన (డెస్టినేషన్) నిందితులు
530 మంది రవాణాదారులు
65 మంది వినియోగదారులు
251 మంది పెడ్లర్లు
2024 సంవత్సరంలోని గంజాయి కేసులు:
2024లో, అనకాపల్లి జిల్లాలో 162 గంజాయి కేసులు నమోదు చేయబడ్డాయి. వీరిలో 423 మంది నిందితులు అరెస్టయ్యారు. 7,442.43 కిలోల గంజాయి, 112 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 కిలోల హాషిష్ ఆయిల్ కూడా స్వాధీనం చేసుకోబడింది, దీని విలువ సుమారు ₹3.72 కోట్లు. అంతకుముందు నమోదు చేసిన కేసులలో 145 మంది పరారీలో ఉన్న నిందితులు కూడా అరెస్టయ్యారు.
నివారణ చర్యలు:
గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ప్రధాన రవాణా మార్గాలను గుర్తించి 5 శాశ్వత చెక్పోస్టులు మరియు 24 డైనమిక్ చెక్పోస్టులను ఏర్పాటు చేసింది.

శాశ్వత చెక్పోస్టులు:
- తాటిపర్తి:*వి.మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో పాడేరు నుండి విశాఖపట్నం రూట్
- డౌనూరు: *నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చింతపల్లి నుంచి నర్సీపట్నం రూట్
- కోనం:* చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో హుకుంపేట, ఆనంతగిరి నుంచి చీడికాడ రూట్
- భీమవరం: కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొయ్యూరు నుంచి నర్సీపట్నం రూట్
- శ్రీరామపురం: దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆనంతగిరి నుంచి దేవరపల్లి రూట్
ఈ చెక్పోస్టులు 24/7 పనిచేస్తున్నాయి. ఇవి సీసీటీవీ కెమెరాలు, పోలీస్ జాగిలాల బృందాలతో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పనిచేస్తున్నాయి. ఇవే కాకుండా 24 ఇతర మార్గాలు వద్ద డైనమిక్ చెక్ పోస్ట్ ల ద్వారా వాహన తనిఖీలు నిరంతరంగా చేయడం జరుగుతుంది. అలాగే అనకాపల్లి జిల్లాలోని 61 లాడ్జిలకు, 76 ట్రావెల్ ఏజెన్సీ కు మరియు వాహనదారులకు గంజాయి అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారం తెలపాలని మరియు ఎటువంటి చట్ట వ్యతిరే కార్యక్రమం లలో పాల్గొన రాదని నోటీసులు జారీ చేయడం అయినది.
డ్రోన్లు:
కాలిబాట మరియు ఇతర రవాణా మార్గాలపై గంజాయి రవాణా ను నిరోధించడానికి 3 డ్రోన్లను వినియోగిస్తున్నారు.
పోలీస్ జాగిలాలు:
బన్నీ మరియు రిటా అనే 2 శిక్షణ పొందిన జాగిలాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్టాటిక్ చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
470 మంది అనుమానితులపై 3 కేడీ షీట్లు, 4 రౌడీ షీట్లు తెరవడం జరిగింది. 11 మంది అలవాటు పడిన నేరస్థులపై పీడీ చట్టం అమలు చేశారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా పెట్టారు.
ఈ కార్యక్రమంలో గౌరవ డిజిపి గారితో పాటు ఈగల్ డైరెక్టర్ ఐజిపి శ్రీ అకే రవి కృష్ణ ఐపీఎస్ గారు, విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ క్రిష్ణన్ ఐఏఎస్.,
ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్ ఐపీఎస్., ఈగల్ ఎస్పీ శ్రీ కె.నగేష్ బాబు,
అదనపు ఎస్పీ శ కె.ధీరజ్
అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, అనకాపల్లి ఆర్డిఓ కుమారి షేక్ ఆయేషా, డీఎస్పీలు బి.అప్పారావు, వి.విష్ణు స్వరూప్, పి.శ్రీనివాసరావు, శ్రీమతి శ్రావణి, ఈ.శ్రీనివాసులు, పరవాడ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు ఇతర జిల్లా అధికారులు మరియు సిబ్బంది గంజాయి ధ్వంసం కార్యక్రమంలో పాల్గొన్నారు.