విశాఖపట్నం,(అక్షర ప్రలయం)
విశాఖపట్నం అరిలోవలో నిర్వహించబడుతున్న బాలుర పరిశీలనా గృహాన్ని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సందర్శించారు.ఇటీవల కాలంలో వైజాగ్ బాలికల వసతి గృహంలో చోటుచేసుకున్న పరిణామాలు దృష్ట్యా బాలుర పరిశీలనా గృహాన్ని సందర్శించి బాలురకు కల్పించబడుతున్న సేవలు ,సదుపాయాలు గురుంచి ఆరా తీసి వంటకాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.అప్పారావు మాట్లాడుతూ సిబ్బంది బాలలు తో స్నేహపూర్వకంగా ఉండాలని అంకిత భావంతో,సేవా దృక్పథంతో పనిచేయాలని కోరారు.నూతనంగా నిర్మించిన భవన సముదాయమును తొందరలో వినియోగంలోకి తీసుకొని రావడము , అదే విధంగా చాలా కాలంగా ఖాళీగా భర్తీ కాకుండా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలకు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కే.వీరయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.