- నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వినియోగించ రాదు.
- సుంకరి రామకృష్ణా రావు, విశ్రాంత ఉపకులపతి, కృష్ణా విశ్వవిద్యాలయం
విశాఖపట్నం, జనవరి:30(అక్షర ప్రళయం)
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడండి అని కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణా రావు కోరారు. గురువారం ఉదయం ఎంవిపి కాలనీలోని సమత డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో, సస్టైనబుల్ రీజిలియన్స్ యూనిట్ – జివిఎంసి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ల నేతృత్వంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనం త్రాగే నీరు, మనం భుజించె ఆహారం, మనం జీవిస్తున్న భూమి, నదులు, నదాలు, చెరువులు సుస్థిరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని అన్నారు. అలా లేకపోతే మన తరానికే భవిష్యత్తు లేదన్నారు. ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వినియోగించ రాదన్నారు. వాటి వల్ల మనకు నేరుగా కలిగే నష్టాలు వర్ణనాతీతం అని వివరించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు ఇయుబి రెడ్డి మాట్లాడుతూ మంచి నీటి ని ఆదా చేయడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని కోరారు. భూగర్భ జలాలు అడుగంటకుండా వర్షపు నీటి వనరులు పెంపొందించేందుకు నిరంతరం కృషి చెయ్యాలి అని కోరారు. సుస్థిరంగా జలాలు నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. చిత్తడి నేలలు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి అన్నారు.ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ జాతీయ సభ్యులు ఎం వివి మురళి మోహన్ మాట్లాడుతూ జల వనరుల కాలుష్యం వల్ల కలిగే నష్టాలమీద, అనారోగ్య సమస్యల మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు.డబుల్యు డబుల్యు ఎఫ్ ప్రతినిధి హాని మాట్లాడుతూ బంగాళా ఖాతం లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు వల్ల జనావళికి, జీవరాశికి కలుగుతున్న నష్టాలు వివరించారు. సముద్రం చెత్త కుండీ కాదని, అది భవిష్యత్తు ఆహార కేంద్రం అనేది గుర్తుంచుకోవాలి అని కోరారు .ఈ కార్యక్రమంలో సమత డిగ్రీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, బోటని లెక్చరర్ రాజా ప్రవీణలు మాట్లాడారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, కోఆర్డినేటర్ ఐ కృష్ణ కుమారి, గ్రీన్ రిప్రజంటెటివ్ జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.