విశాఖ తూర్పు,(అక్షర ప్రళయం)
విశాఖ జిల్లా వాల్తేర్ డిపో నందు 72 రోజులు అలుపెరగని ఉద్యమం చేసి రాష్ట్ర అధ్యక్షులు పి.వి. రమణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ల చొరవతో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వాల్తేర్ డిపో ఉద్యోగులు సమస్యలపై చేసిన న్యాయమైన పోరాటానికి అధికారులు సానుకూలంగా స్పందించి కౌన్సెలింగ్ ద్వారానే అందరికీ డ్యూటీ చార్ట్ లలో న్యాయం జరుగుతుందని యన్.యం.యు వాల్తేర్ కమిటీ చేసిన ఉద్యమ ఫలితంగా చేసిన ఎగ్రిమెంట్ లో భాగంగా పారదర్శకంగా వాల్తేర్ డిపో నందు వేసిన డ్యూటీ చార్టులు ఈ రోజు అమలు జరగటంతో డిపోలో విజయోత్సవ సంబరాలు జరిగాయి.స్వీట్స్ పంచుకొని ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి ఆర్.వసంతరావు మాట్లాడుతూ కౌన్సెలింగ్ విధానం ద్వారా డ్రైవర్ కండెక్టర్లకు వారు కోరుకున్న రూటు రావడం వల్ల సర్వీస్ పై అవగాహన వల్ల ఇష్టపడి పనిచేయడం వల్ల సంస్థకు మంచి ఆదాయం చేకూరుతుందని అన్నారు.మహిళలకు ప్రత్యేక చార్టుల ద్వారా వారికి వెసులు బాటు కల్పించడం జరిగిందని అన్నారు. ఉద్యమం దరిమల అధికారుల సానుకూల విధానాల వల్ల చివరి స్థానంలో ఉన్న విశాఖ జిల్లా నాల్గవ స్థానంలోకి విజయనగరం జోన్ మొదటి స్థానంలోకి రావడం జరిగిందని అన్నారు.ఇది అందరికీ ఆదర్శప్రాయం అవుతుందని అన్నారు.దుష్ట శక్తులు ఎన్ని అడ్డుపడినప్పటికి కార్మికుల న్యాయమైన పోరాటమే విజయం సాదించి సంస్థ అభివృద్ధికి మేలు జరిగిందనిఅన్నారు.న్యాయమైన పోరాట ఫలితంగా అన్ని యూనియన్ల సభ్యులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు రాష్ట్ర కమిటీకి జోనల్ కమిటీ రీజినల్ కమిటీ డివిజనల్ కమిటీ జిల్లా నందుగల అన్ని డిపో కమిటీలకు గ్యారేజి కమిటీలకు అధికారులకు సూపర్ వైజర్లకు సెక్యూరిటీ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు పి.జి.పతి గ్యారేజి అధ్యక్ష కార్యదర్శులు డిపో కమిటీ గ్యారేజి ఉద్యోగులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.