సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల పై అవగాహన కలిగించిన సి.ఐ. జి.డి బాబు

వన్ టౌన్, (అక్షర ప్రళయం)

సైబర్ క్రైమ్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం ని
వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జీ.డి. బాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం మత్స్యకార సంఘాల నాయకులతో పాటు ప్రజల సమక్షంలో మత్తు పదార్థాల ప్రభావం మరియు సైబర్ క్రైమ్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, ప్రజల భద్రత కోసం “మీ కోసం మీ పోలీస్” అనే ప్రత్యేక కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కరపత్రం ద్వారా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో 24/7 ఎప్పుడైనా పోలీసులను సంప్రదించవచ్చు అనే సందేశాన్ని తెలియజేశారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగం, లేదా సైబర్ నేరాల గురించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇన్స్పెక్టర్ జీ.డి. బాబు మాట్లాడుతూ, “పోలీసు శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా, 24 గంటల పాటు ఎప్పుడైనా పోలీసులను సంప్రదించండి. ప్రజల సహకారంతోనే సమాజాన్ని నేరముక్తంగా మార్చగలం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల నాయకులు, యువత, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *