విశాఖ తూర్పు, (అక్షర ప్రళయం)
బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం. పరశురామ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్ జి మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎం. నాగేంద్ర, బీజేపీ జిల్లా ఇంచార్జి పుట్ట గంగయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు తదితరులు విచ్చేసి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.