కేఎన్ఆర్..
గాజువాక, (అక్షర ప్రళయం)
గాజువాక పాతకర్నవానిపాలెం బిజేపి కార్యాలయంలో జన్ సంఘ్ పార్టీ పూర్వ అధ్యక్షులు మరియు బిజేపి సిద్ధాంత కర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప భారత తత్వవేత్త, ఆర్దిక వేత్త, చరిత్ర కారుడు, పాత్రికేయుడు,సామాజిక వేత్త, రాజకీయ శాస్త్రవేత్త,మరియు బిజేపి పార్టీ సిద్ధాంతమైన ఏకాత్మ మానవవాదం , అంత్యోదయను ప్రవచించిన గొప్ప మహనీయులని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ,వారి ఆశయాలను అమలు చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు,బొండా యల్లాజీ రావు,రోహిణి,కట్టా పద్మ,శ్రీదేవి,రంగనాయకులు,బొత్స దిలీప్ కుమార్ ,అనిత,ముసలయ్య,వరలక్ష్మీ,కరణం.వెంకటరావు,రంజిత్,సురేష్ రెడ్డి,అనురాగ్ సింగ్,సోనిశర్మ,కృష్ణారెడ్డి,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.