పెందుర్తి, ఫిబ్రవరి:24(అక్షర ప్రళయం)
జీవీఎంసీ 95వ వార్డు చీమలాపల్లి నియర్ వరలక్ష్మినగర్ లో వీఎంఆర్డీఏ నిధులు సుమారుగా 5.50 కోట్లతో చేపట్టిన కన్వెన్షన్ సెంటర్ పనుల్ని కార్పొరేటర్ ముమ్మన దేముడు సోమవారం నాడు పరిశీలించారు.ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న ఫ్లోరింగ్,పిఓపి సీలింగ్స్,సెంట్రల్ ఏసి,పార్కింగ్ ఏరియా,పనుల్ని సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు ఆయన ఆదేశించారు.కార్యక్రమంలో (చినముషీడివాడ మండలం) బిజెపి 95,97వ వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్,టిడిపి సీనియర్ నాయకులు అయిత ఎర్నిబాబు,కూటమి నాయకులు మద్దాల శ్రీను,సబ్బవరపు ప్రకాష్,కంచిబోయిన వెంకట సంతోష్,ప్రభాకర్,గంట్ల నర్సింహామూర్తి,పీడీవి ప్రసాద్,ఉమా మహేశ్వరరావు,గోపాల్,నొడగల అప్పలరాజు,అయిత శివ,హరి,టైల్స్ రాజు,వివిధ కోలని ప్రతినిధులు దువ్వి అప్పారావు,అంగటి సూరిబాబు,తదితరులు పాల్గొన్నారు.