కేజీహెచ్‌లో శిశువుల మార్పిడి కలకలం..!

విశాఖపట్నం, (అక్షర ప్రళయం)

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి గైనెకాలజీ వార్డులో ఒక కుటుంబానికి బదులుగా మరొక కుటుంబానికి శిశువును అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై బాధిత కుటుంబాలు ఆసుపత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాము తమ నిజమైన శిశువును తిరిగి పొందే వరకు వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. దీంతో గైనెకాలజీ వార్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శివానంద్ స్పందించారు. సదరు మార్పిడి ఎలా జరిగింది? ఎవరి వైఫల్యమో తెలుసుకోవడానికి ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే సీీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి తేవాలని తెలిపారు.

వైద్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై నివేదిక కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు సామాజిక సంస్థలు స్పందించాయి. విచారణ ఫలితాన్ని ఆధారంగా తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి వర్గాలు హామీ ఇచ్చాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *