హైదరాబాద్ హలీం సెంటర్ ను ప్రారంభించిన
ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్,సీతమ్మ రాజు సుధాకర్
విశాఖపట్నం, ఫిబ్రవరి :27(అక్షర ప్రళయం)
ఆధ్యాత్మికంగా రంజాన్ మాసం ఎంతో పవిత్రమని దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్,సీతమ రాజు సుధాకర్ అన్నారు రంజాన్ మాసం పురస్కరించుకొని జగదాంబ జంక్షన్, మహారాణిపేట మక్కా మస్జిద్ సమీపంలోని హైదరాబాద్ హలీం సెంటర్ ను ఆయన చేతుల మీదుగా గురువారం సాయంత్రం ప్రారంభించారు. రంజాన్ మాసం ఉపవాస దీక్ష అనంతరం ముస్లిములు స్వీకరించే హలిం సెంటర్ ను ప్రతి ఏటా నిర్వహించడం మంచి సాంప్రదాయమని, అభినందనీయమని అన్నారు, ప్రపంచంలోనే సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లో సాయంత్రం ఆహారంగా ఉపయోగించినట్లు తెలిపారు.హలీమ్ అనేది దక్షిణ ఆసియా, మధ్యప్రాచ్యం మరియు మధ్య ఆసియాలో విస్తృతంగా వినియోగించబడే ఒక రకమైన వంటకం. డిష్ ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉన్నప్పటికీ, ఐచ్ఛికంగా గోధుమలు లేదా బార్లీ, మాంసం మరియు కాయధాన్యాలు ఉంటాయి. పప్పు మరియు సుగంధ ద్రవ్యాలలో మాంసాన్ని నెమ్మదిగా ఉడికించడం ద్వారా దీనిని తయారు చేస్తారని అన్నారు. అనంతరము హలీమ్ సెంటర్ నిర్వాకుడు విక్రేత షేక్ జుబేర్ మాట్లాడుతూ పోషకాహారం. హైదరాబాదీ హలీమ్ అనేది అధిక కేలరీల వంటకం , ఇది నెమ్మదిగా జీర్ణమయ్యే మరియు త్వరగా మండే పదార్థాలను కలిగి ఉండటం వలన తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. మాంసం మరియు డ్రై ఫ్రూట్స్ దీనిని అధిక ప్రోటీన్ ఆహారంగా చేస్తాయని,అధిక కేలరీల భోజనం, ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఈ కలయిక రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది మరియు డయాబెటిస్ ఉన్నవారిలో హైపర్గ్లైసీమియా (అధిక రక్తంలో చక్కెర) కు దోహదం చేస్తుందన్నారు. ఈ హలీం సెంటర్ 40 రోజుల వరకు కొనసాగుతుందని అన్నారు. కార్యక్రములో వైసీపీ స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రెటరీ ఐ ఎం ఫారూఖీ, విశాఖపట్నం సిరత్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ లతీఫ్ , ఆసిఫ్,షబ్బీర్ కైలాసపురం మస్జిద్ అధ్యక్షుడు మున్నీరు ఖాన్,35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, టీడీపీ నాయకులు బత్తిన నవీన్ జాఫరుల్లా అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు టిడిపి నాయకులు సిబ్బంది పాల్గొన్నారు