శ్రీశైలం,(అక్షర ప్రళయం)
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ , శ్రీశైల దేవస్థానం మరియు శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంయుక్తంగా శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున బ్రమరాంబికా దేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ శ్రీ మహా శివ జాతీయ అవార్డుతో బీసీల జాతీయ కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవనాయుడును డైరెక్టర్ డాక్టర్ పల్లం శెట్టి సురేష్ ఎంగేజ్మెంట్ గుప్తా ప్రధానం చేశారు. డాక్టర్. బత్తుల సంజీవ రాయుడు గత 40 సంవత్సరముల నుండి గ్రామీణ అభివృద్ధి , సాంఘిక సంక్షేమం, శిశు సంక్షేమం , మహిళా అభివృద్ధి , పర్యావరణ పరిరక్షణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం, విద్యా , వైద్య జంతు సంక్షేమం, నీటి సంరక్షణ మొదలగు రంగాలలో అంకిత భావంతో విశేషమైన కృషి చేసినందుకు సేవారత్న జాతీయ అవార్డును ప్రధానం చేశారు. ఈయన జాతీయ బీసీల కార్యదర్శిగా, భారత ప్రభుత్వంలో ట్రాయ్ కాగ్ మెంబర్గా , టెలికం గ్రాంట్ సౌత్ ఇండియా కమిటీ మెంబర్గా, బిఎస్ఎన్ఎల్ ఏపీ స్టేట్ అడ్వైజర్ మెంబర్గా , జియో ఏపీ స్టేట్ అడ్వైజరీ నెంబర్ గా , వోడాఫోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వైజరి మెంబర్గా, టాటా సెల్ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అడ్వైజర్ మెంబర్గా ప్రస్తుతం కొనసాగుతూ, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు . 1991లో జిల్లా కలెక్టర్ అవార్డును , 1992లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి అవార్డు ,1997లో నిఖిల్ కువైతార జాతీయ అవార్డు, 2000 సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డు , 2004 సంవత్సరంలో ప్యాప్సీ జాతీయ అవార్డు , 2017 వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ పీస్ అవార్డు , 2022 సంవత్సరంలో గాంధీ పీస్ అవార్డు లతోపాటు ఇంకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు స్వీకరించారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాలు , మహిళా సంఘాలు , యువజన సంఘాలు , రాజకీయ నాయకులు , పార్టీలు , ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.