మధురవాడ (అక్షర ప్రళయం)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.200 కోట్లతో నిర్మించే ఈ స్పోర్ట్స్ సెంటర్ దేశంలోనే రెండోది. దీని నిర్వహణ ఖర్చునూ కేంద్రమే భరించనుంది. దీంతో పాటు కృత్రిమ అవయవాలు తయారు చేసే అలిమ్కో కేంద్రాన్నీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి మధురవాడ కొమ్మాదిలో 22 ఎకరాలను కేటాయించగా,3 నెలల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు.ఇదేవిధంగా మరో కేంద్రాన్ని విజయవాడలో తెచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం యోచిస్తుంది.