-డాక్టర్ ఎన్. కిషోర్, జి విఎంసి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్.
విశాఖపట్నం,(అక్షర ప్రళయం)

రోడ్లపై తిరిగే మూగ జీవాలకు తాగునీరు అందించండి అని జి విఎంసి సిటీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ ఎన్. కిషోర్ కోరారు. ఆదివారం ఉదయం డాక్టర్ జ్యోతి డోకి, వివేక్ చెవ్వాకుల, ఆర్తి కల్లపల్లిల నేతృత్వంలో వాటర్ బౌల్ మిషన్ లో భాగంగా రామకృష్ణ బీచ్ లో పశుపక్ష్యాదుల కోసం మంచి నీళ్ళు అందించేందుకు మట్టి పాత్రలు ఏర్పాటు చేశారు. అనంతరం డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ ఈ మిషన్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నీటి గిన్నెలు ఏర్పాటు చేయడం ద్వారా మూగ జీవాలకు నీటి కొరత లేకుండా చూడటమే ముఖ్య ఉద్దేశ్యం అని వివరించారు.

ఈ తరహా కార్యక్రమాలు మన సమాజాన్ని మరింత దయతో నిండినదిగా మార్చగలదని పేర్కొన్నారు. నిర్వాహకులు ప్రజలను తమ ఇళ్ల ముందు, కార్యాలయాల వద్ద నీటి గిన్నెలను ఉంచి మూగ జీవులకు సహాయపడాలని కోరారు. మనమంతా కలిసి మూగ జీవాలకు నీరు అందించడంలో భాగస్వాములం అవ్వుదామని,వీరికి వైజాగ్ ఫరెవర్ టీమ్ శక్తివంతమైన మద్దతునందిస్తిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్వాంతన సంస్థ డైరెక్టర్ ప్రజ్ఞాన్ కుమార్ , చైల్డ్ రైట్స్ ఆడ్వకసీ ఫౌండేషన్ కో-కన్వీనర్ విశాలాక్షి, అనన్య హోం ప్రతినిధి అనురాధ, వావ్ ఫౌండేషన్ ప్రతినిధి లోకేష్, దేవ సర్వీస్ సంస్థ ప్రతినిధి తరుణ్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు.