విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
దక్షిణంలో పండగ అయినా కార్యమైన ముందుగా గుర్తొచ్చేది వాసుపల్లి గణేష్ కుమార్ సేవా కార్యక్రమాలు. దీనిలో భాగంగానే జీవీఎంసీ 34వ వార్డులో గ్రామ పండుగకు మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5000/- ఆర్థిక సాయం అందించారు. ఆసీలమెట్ట కార్యాలయంలో 34వ వార్డు వైఎస్ఆర్సిపి నేతల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులకు రూ.5వేలు రూపాయలు నగదును స్వయంగా వాసుపల్లి గణేష్ కుమార్ అందజేశారు. ప్రజల కష్టమేనా, నేతల అవసరమైన సమస్యలకైనా సొంత నిధులతో చేయూతనందిస్తున్నారు. అధికారంలో లేకున్నా తన ప్రజలకు అండగా వాసుపల్లి గణేష్ కుమార్ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. జగనన్న ఆశయాలతో మదర్ తెరిసా రోల్ మోడల్ గా అంబేద్కర్ అడుగుజాడల్లో తన జీవితాంతం ప్రజా సేవలోనే ఉంటానని వాసుపల్లి గణేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి రామానంద్, జిల్లా కార్యదర్శి ఆది విష్ణు రెడ్డి, సౌత్ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు సువార్త రాజు, ఎర్రినమ్మ తల్లి గుడి చైర్మన్ లండ రమణ, 35వ వార్డ్ అధ్యక్షులు అలుపన కనకా రెడ్డి , లింగం శ్రీను, అరుగుల రాజు, బోర శ్రీనివాస్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.