ద నేషనల్ కన్సుమర్ రైట్స్ అనకాపల్లి జిల్లా చైర్మైన్ హేమంత్ చరపాక
న్యూస్ డెస్క్, మార్చి:26(అక్షర ప్రళయం)
మార్కెట్లో ప్రస్తుతం అనేక అసత్య ప్రకటనలు చూసి కల్టి వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులను మోసపోతున్నారు. కొన్నికంపెనీలు తమ ఉత్పత్తులను అబద్ధపు వివరాలతో ప్రదర్శిస్తూ, వినియోగదారులను తప్పుడు దారులు పట్టిస్తున్నారు. ఈ వస్తువులు నిజంగా పనిచేయవు, కానీ వినియోగదారులు వాటిని నమ్మి నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, ఉత్పత్తుల సమీక్షలు చదవాలని, వస్తువు సమాచారం తెలుసుకోనీ మంచి వస్తువుని ఎంపిక చేసుకొవాలని ప్రకటనలు చూసి అస్సలు కొనుగోలు చేయవద్దని ద నేషనల్ కన్సుమర్ రైట్స్ అనకాపల్లి జిల్లా చైర్మైన్ హేమంత్ చరపాక సూచించారు . వినియోగదారులు తమకు కావలసిన ఉత్పత్తి లేదా సేవను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చని వ్యాపారాలు, విక్రయదారులు, లేదా సంస్థలు ఎంపిక విధానంలో ప్రజలు పై ఒత్తిడి తేవడాన్ని గమనించుకోవాలన్నారు. వినియోగదారులకు కొనుగోలు చేసే ఉత్పత్తి లేదా సేవ గురించి వ్యాపారులు పూర్తి వివరాలు, ధర, నాణ్యత, మరియు ఉపయోగాలు ఇస్తే, వారు సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారని అన్నారు . ప్రతి వినియోగదారుడుకు హక్కులు వుంటాయని తన హక్కులను సమర్థంగా వినియోగించాలని, మోసాలను అరికట్టేమార్గం ఎంచుకోవాలని ,ప్రతి కొనుగోలు లేదా సేవలకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మోసాలకు గురైన వినియోగదారులు వెంటనే అందుబాటులో ఉన్న కన్సుమర్ టోల్ ఫ్రీ సర్వీసులు 1800-11-4000 ద్వారా లేదా కోర్ట్ లో ఫిర్యాదు చేసుకొని నష్ట పరిహారం పొందోచ్చని, తమ సంస్థ టిఎన్సిఆర్సి అన్ని వేళల వినియోగదారులకు సహాయం అందుస్తుందని 9985466317 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా ఛైర్మన్ హేమంత్ చరపాక తెలిపారు.