ఎస్సై భాస్కర్ సకాలంలో స్పందించడంతో ప్రాణాలతో బయటపడిన యువతి..
సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన యువతి తల్లి..!
హెడ్ కానిస్టేబుల్ విజయ్ సహకారంతోనే ముందడుగులు వేసాం- ఎస్సై భాస్కర్..
పి ఎం పాలెం,ఏప్రిల్:04(అక్షర ప్రళయం)
పీఎం పాలెం పోలీస్ స్టేషన్ ఎస్సై కే భాస్కర్ మానవత్వం చూపడంతో ఓ నిండు ప్రాణం బ్రతికింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మధురవాడ కొమ్మాది జంక్షన్ స్వయంకృషి నగర్ లో ప్రమాఉన్మాది దాడి ఘటనలో రక్షక భటులు కి వచ్చిన సమాచారం మేరకు ఒక్క క్షణం కూడా అలసత్వం వహించకుండా ఎస్సై భాస్కరరావు, హెడ్ కానిస్టేబుల్ విజయ్ తమ బాధ్యతలను నిర్వహించారు. ఘటన జరిగి 20 నిమిషాలు గడిచిన రక్తపుమడుగులో ఉన్న యువతని చూస్తున్న జనాలు మధ్య తన మనసు చలించిందని భవంతి పైకి వెళ్లి చూడగా ఆమె తల్లి అప్పటికే మరణించి ఉందని అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా తీసుకు వెళ్లాలంటే మరో 20 నిమిషాలు సమయం పడుతుందని ఆ సమయం వృధా అయితే ఆ నిండు ప్రాణం పోతుందని ఆ సాహసానికి వడగట్టాల్సి వచ్చిందని ఎస్ఐ భాస్కరరావు తెలియపరిచారు. చట్ట ప్రకారం తమ విధులు నిర్వహిస్తామంటూ చాలామంది అధికారులు ఆ సమయంలో అలసత్వం వహించే సందర్భలు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటికి భిన్నంగా ఎస్సై భాస్కరరావు తీసుకున్న నిర్ణయంతో సిటీ ప్రజలు ఆయన్ని ప్రశంసల జల్లుతో ముంచేత్తుతున్నారు. భాస్కర్ ఏ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించిన ఆ స్టేషన్ పరిసర ప్రాంగణ ప్రజలందరూ తన తోబుట్టువులు అంటుంటారు. గతంలో ఆయన అలాంటి సేవలే చేస్తూ ఆయన అంటున్నా ఒకే ఒక నానుడి పదం.. కుడి చేత్తో చేస్తే సహాయం ఎడమ చేతికి తెలియాల్సిన పనిలేదని అంటుంటారు. మా విధులు ప్రకారమే మేము చట్టప్రకారంగానే విధులు కొనసాగిస్తామని కానీ కొన్ని సందర్భంలో నేను ఒక మనిషినే మానవత్వం ప్రదర్శించాల్సిన సమయంలో చూపకపోతే మనిషిగా పుట్టి ఏమి ప్రయోజనమని ఆయన కొనియాడారు. జరిగిన ఘటనలో గోల్డెన్ అవర్స్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంది ఆ 20 నిమిషాల్లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ ఎస్ఐ భాస్కర్ చాతుర్యతతోనే ఆ యువతి బ్రతికిందని వైద్యులు కూడా తెలిపారు. ఆ ఇరువురు తనకెందుకులే అని అనుకుంటే అంబులెన్స్ వచ్చేదాకా ఆ యువతని ఆ రక్తపు మడుగుల్లోనే ఉంచితే ఈరోజు ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయేవాళ్ళం. ప్రేమ కోసమో ప్రమాఉన్మది ఈ ఘటనకు పాల్పడే ఉంటాడు కానీ ఈ ఘటనలో 20 నిమిషాలు ఓ యువతి నిస్సాహేత స్థితిలో ఉన్న మానవత్వం చూపాల్సిన ప్రజలు చుట్టుపక్కలే ఉన్నారనే తప్ప ఎవరూ పట్టించుకోలేదు అన్న సమాచారం.
ఎస్సై భాస్కర్ మాట్లాడుతూ వన్ వన్ టూ కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తం అయ్యామని మహిళ రక్తపు మడుగులో ఉన్నదని తెలుసుకున్న వెంటనే ఒక క్షణం ఆలోచించకుండా నేను హెడ్ కానిస్టేబుల్ విజయ్ ఘటన స్థలానికి చేరుకున్నామని ఒక్క క్షణం ఉన్న ప్రాణాలను బతికించాలనేదే ప్రతి ఒక్కరు తాపత్రయం అని ఆ క్షణాలు వృధా అయితే ఆమె ప్రాణం కోల్పోయే వాళ్ళమని అందుకనే హెడ్ కానిస్టేబుల్ విజయ్ తో పాటు తో రక్తపు మడుగులో ఉన్న యువతని బైక్ మీద తీసుకువెళ్లి గాయత్రి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగిందని హాస్పిటల్ వైద్యులు కూడా సకాలంలో స్పందించడంతో ఆమెకు వైద్యం అందిందని ఆయన అన్నారు. ప్రాణం విలువ తెలిసిన వాడినని గతంలో నేను రోడ్డు ప్రమాదం నుంచి బయటపడే వచ్చానని ఆయన అన్నారు . మన కళ్ళ ముందు పోయే ప్రాణానికి చేయూతని ఇవ్వాలని ఆయన కోరారు గోల్డెన్ అవర్స్ లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గానీ ఇలాంటి హత్య ఉన్మాదులు జరిగినప్పుడు గానీ నీ కళ్ళ ముందు ఉండే ప్రాణాన్ని కాపాడేందుకు నువ్వే ఓ సైనికుడు అవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్న పదానికి విస్మరించండి ఆ సమయంలో మీరేం చేయగలిగారు, మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తే బ్రతుకుతారో అన్న ఆలోచనలోనే ఉండాలని ఆయన అన్నారు. ఎస్సై భాస్కర్ గురించి చెప్పాలంటే ఈ ఒక్క సందర్భమే కాదని చాలామంది ఆయన గురించి తెలిసిన వారు అనుకుంటున్నారు .ఆటో డ్రైవర్ చనిపోతే ఆయనకి సంబంధం లేని వ్యక్తి అయినా ఆయనకి ఆర్థికంగా సహాయం పరిచారు. తన వాట్సప్ స్టేటస్ ద్వారా ఎంతో మందికి చైతన్యం కల్పించి ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారని సమాచారం. కరోనా సమయంలో కూడా తన సొంత నిధులతో 1500 మందికి ఆహార పదార్థాలు ఏర్పాటు చేశారని, తాను చేసే పనిలో ఆత్మ సంతృప్తి కలిగితే చాలని తన జీవితంలో ఎదుటివారికి సహాయపడేంత సమయాన్ని కేటాయింపు చేస్తారని ఆయన అనడం ప్రశంసనీయం. ఇలాంటి రక్షకబటలు చాలా అరుదుగా ఉంటారు అలాంటివారికి సిటీ ప్రజలు ప్రశంస జల్లు కురిపించడం తప్పేమీ కాదంటున్నారు పలువురు స్వచ్ఛంద సేవకులు.