విశాఖ దక్షిణం, (అక్షర ప్రళయం)

భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహారాణి పేట మండలం లో మండల అధ్యక్షుడు దేవర చంద్రశేఖర్ ఆధ్వర్యం లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కేశవకాంత్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ మరియు మైనారిటీ మోర్చ నాయకులు బాషా సౌత్ కన్వీనర్ అతిల్ శంకర్ రావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ రాజకీయాలలో అవినీతిని రహిత సమాజాన్ని నిర్మించేందుకు బిజెపి ఆవిర్భవించిందని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుండి ఈనెల 14వ తేదీ వరకు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంత్యోదయ స్పూర్తితో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు చితకల రాజు బాబూ జిల్లావైస్ ప్రెసిడెంట్ తలడ గీరిజా మరియు మహిళా మోర్ఛ నాయకులు దశమంతుల సుశీల మంజుల, రమా,బూత్ ప్రెసిడెంట్ 184 కే పద్మ 194 బూత్ శంకర్ పల్లా చలపతి మరియు వార్డ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.