ముఖ్య అతిథిగా హాజరైన చొక్కాకుల రాంబాబు..
భీమిలి, (అక్షర ప్రళయం)

భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ సూచన మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు
ఎం.ఎం.ఎన్ పరుశురామరాజు ఆదేశాల మేరకు ఎండాడ మండలం నందు గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగాశుక్రవారం 8వ వార్డు రుషికొండ, ఎండాడ ప్రాంతము నందు మహాత్మ జ్యోతిరావు పూలే వారి యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షులు చోడవరపు నాగరాజు మరియు వార్డు ఉపాధ్యక్షులు వి వి సుబ్బరాజు, వార్డు మహిళా మోర్చా అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, వార్డు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం.. 6వ వార్డులో కూడా జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా చొక్కాకుల రాంబాబు మాట్లాడుతూ
బానిసత్వ సంకెళ్లు నుండి బహుజనులను మేలుకోల్పిన విముక్త ప్రధాత, విద్య ద్వారా మూఢ విశ్వాశాల నుండి సమాజాన్ని చైతన్యపరిచిన సాంఘిక చైతన్యమూర్తి, మహిళల విద్యకు పునాది వేసిన ఆధునిక భారత నిర్మాణకర్త, సత్యశోదక్ సమాజ్ వ్యవస్థాపకులు మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జోహార్లు అర్పిస్తున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో
చొక్కాకుల రాంబాబు మండల ఇన్చార్జి, ఎండాద మండలం 6 వ వార్డు అధ్యక్షులు జి.అర్.ఎస్.ఎన్.రాజు పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. తదనంతరం రెండు వార్డుల్లోని పార్టీ యొక్క కండువాలు వేసుకొని దళితవాడలో పర్యటించడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమం ఇన్చార్జి చుక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో ముఖ్యముగా పెండ్యాల శ్రీనివాసరావు ఆఫీస్ సమక్షమున ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.