అత్యధిక మార్కులు సాధించిన ఘనత..
విద్యార్థినీ ,విద్యార్థులను అభినందించిన ఎస్వీకే చైర్మన్, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం(అక్షర ప్రళయం)
ఇంటర్ పరీక్షా ఫలితాలు మద్దిలపాలెం వద్ద ఉన్న వంశీకృష్ణ (ఎస్వీకే )కాలేజ్ విజయభేరి మోగించింది. ఉత్తరాంధ్రలో అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ఇంటర్ సెకండియర్ ఫలితాలు లో శివ శృతికి 975 మార్కులు, రాంచరణ్ కు 954 మార్కులు, కార్తీక్ తేజ కు 953 మార్కులు, త్రిశాలి కి 949 మార్కులు, తను ప్రియకు 962 మార్కులు, సంధ్య 921 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ లో ప్రవల్లిక 444 మార్కులు, కావ్యకు 427 మార్కులు, ప్రనిత్య 430 మార్కులు , రోషనీ 415 మార్కులు తో పాటు నూరు శాతం రిజల్ట్ తో ఎస్వికె కాలేజీ విజయకేతం ఎగురవేసింది. ఈ సందర్భంగా ఎస్వికే కాలేజ్ చైర్మన్ వంశీకృష్ణ శ్రీనివాస్ అత్యధిక మార్పులు సాధించిన వారందరికీ స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ ఫలితాల విజయంలో ముఖ్య భూమికి పోషించిన సంస్థ డైరెక్టర్ ,ప్రిన్సిపాల్ సత్యనారాయణ ని అభినందించారు. కార్యక్రమంలో లెక్చరర్ ప్రసాద్, నవీన్, శిరీష, శైలజ , కిరణ్ , స్వర్ణలత , విద్యార్ధులు పాల్గొన్నారు.